News September 5, 2025

HYDలో మురుగు శుద్ధి ఇక వేగవంతం

image

నగరంలో మురుగుశుద్ధి ప్రక్రియ వేగవంతం కానుంది. 39 ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ పనులు దసరాలోగా ప్రారంభిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. బొంగలూరు, తెల్లాపూర్, రావిర్యాల్, ఇక్రిశాట్, కాప్రా, మాసబ్‌ట్యాంక్, బాచుగూడ, మీర్పేట, తిమ్మక్క చెరువు, హెచ్పీఎస్, చిత్రపురి కాలనీ, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి, బాపూఘాట్, హైదర్షా కోట, ఫతేనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News September 5, 2025

బాలాపూర్ లడ్డూ కోసం కొత్తగా ఏడుగురు పోటీ

image

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో పాల్గొనే కొత్తవారి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. గత సంవత్సరం కొలన్ శంకర్ రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మర్రి రవి కిరణ్ రెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివరెడ్డి, సామ రామ్ రెడ్డి, PSK గ్రూప్, జిట్టా పద్మా సురేంద్ రెడ్డి లడ్డూ కోసం కొత్తగా పోటీ పడనున్నారు. లాస్ట్ ఇయర్‌ వరకు లడ్డూ దక్కించుకొన్న వాళ్లు వేలంలో పాల్గొంటారు.

News September 5, 2025

HYD: ఆదివారం ఆలయాలు బంద్

image

ఈ నెల 7వ తేదీన(ఆదివారం) చంద్ర గ్రహణం ఉంది. ఆ రోజు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు తెరుస్తామని చెప్పారు. ఇక చిల్కూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
SHARE IT

News September 5, 2025

రేపు నగరం కిటకిట

image

గణపతి నిమజ్జన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. వేలాది వినాయక విగ్రహాలు వివిధ రూపాల్లో నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకను చూసేందుకు చిన్నా..పెద్దా అందరూ ఎదురుచూస్తున్నారు. నగరవాసులే కాక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 లక్షల మంది నిమజ్జన ఘట్టాన్ని తిలకించనున్నారని గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.