News September 5, 2025
అనకాపల్లి: ‘విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి’

విద్యార్థులను ఉపాధ్యాయులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి అవార్డులు అందజేసి సత్కరించారు. మంత్రి లోకేశ్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పిల్లల భవిష్యత్తుకు బాట వేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 6, 2025
కామారెడ్డి: డ్రోన్ కెమెరాల నిఘాలో వినాయక శోభయాత్ర

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రారంభించారు. ఈ యాత్రను భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
News September 6, 2025
జగిత్యాల: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక

జగిత్యాల జిల్లా అర్పపల్లి ZPHS పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జక్కుల రవి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేస్తూ జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము ఉత్తర్వులు జారీ చేశారు. జక్కుల రవి కష్టపడే తత్వం, అంకిత భావంతో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా సాంఘిక శాస్త్రం చాలా సులభంగా బోధిస్తూ ప్రత్యేకత చాటారని తెలిపారు.
News September 6, 2025
జడ్చర్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: MP

నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విహెచ్పీ ఆధ్వర్యంలో నేతాజీ చౌక్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తీమ్ తో ఏర్పాటుచేసిన గణపతి మండపాన్ని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ ప్రజలందరిపై గణపయ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.