News September 5, 2025
ముస్లింల ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయి: SP

విజయనగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోనూ, ఇతర ప్రాంతాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో సుమారు 1500 మందితో భారీ ర్యాలీ చేపట్టగా, ఎటువంటి ఘటనలు జరగకుండా తమ సిబ్బంది బందోబస్తు నిర్వహించారన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.
Similar News
News September 6, 2025
విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ రద్దు

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 5, 2025
VZM: ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్లో 600/600

ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.
News September 5, 2025
VZM: 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రాత పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస మూర్తి ఆదేశించారు. ఈ పరీక్షకు చేయాల్సిన ఏర్పాట్లపై విజయనగరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు.