News September 5, 2025

భవిష్యత్తులో GST 3.0.. నిర్మల ఏం చెప్పారంటే?

image

సామాన్యులపై భారం తగ్గేలా జీఎస్టీ 2.0 తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ India Todayతో అన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ 3.0 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. దాని ద్వారా ధరల్లో స్థిరత్వం, పారదర్శకత తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిరు వ్యాపారుల్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్‌ల నిబంధనలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. వారిపై భారం పడకుండా చూస్తామని నిర్మల వెల్లడించారు.

Similar News

News September 6, 2025

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

image

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.

News September 6, 2025

సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్‌ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం

News September 6, 2025

PHOTOS: ‘SIIMA’లో మెరిసిన తారలు

image

సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) కార్యక్రమం దుబాయ్‌లో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ హీరోలు, హీరోయిన్స్, నటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, మీనాక్షి చౌదరి, శ్రియ, నిహారిక, అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు సందడి చేశారు. వీరి ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.