News September 5, 2025

2 గ్రూపుల గొడవను ఆపిన ADB ట్రాఫిక్ సీఐ

image

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ADB శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్‌కు వెళ్లే దారి మధ్యలో ఓకే మండపానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి, మద్యం మత్తులో గొడవ పడ్డారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పిన.. వినక పోయేసరికి బలవంతంగా వారిని చెదరగొట్టి పంపించేశారు. ఈ ఘటనను కొందరు పోలీసులు కొట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపట్ల చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

Similar News

News September 6, 2025

ADB: నేడు 450 వినాయక విగ్రహాల నిమజ్జనం

image

జిల్లావ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు జిల్లావ్యాప్తంగా 1500 గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. శనివారం 450 గణపతి విగ్రహాల నిమజ్జనం ఉందని పేర్కొన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని తెలిపారు.

News September 6, 2025

ADB రిమ్స్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్‌రెడ్డి ఉన్నారు

News September 5, 2025

ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డు అందుకున్న ADB వాసి

image

బోధన, అభ్యాసం, పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బోథ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ‘గురుపూజోత్సవం’ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు