News September 6, 2025
ADB రిమ్స్లో ఉపాధ్యాయ దినోత్సవం

ఆదిలాబాద్ రిమ్స్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్రెడ్డి ఉన్నారు
Similar News
News February 11, 2026
బోథ్ అడవుల్లో పులుల సంచారం

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 10, 2026
ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.
News February 10, 2026
1000 మందితో ఎన్నికల బందోబస్తు: ADB SP

ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్ఐలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 వార్డులకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారని వివరించారు.


