News September 6, 2025
కామారెడ్డి: డ్రోన్ కెమెరాల నిఘాలో వినాయక శోభయాత్ర

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రారంభించారు. ఈ యాత్రను భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 6, 2025
గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 9,00,814 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.20 అడుగులకు చేరిందని, ఎగువ ప్రాంత ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 12,700 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నామని తెలిపారు.
News September 6, 2025
విశాఖ: ఫొటో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడి అరెస్ట్

మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్స్టాగ్రామ్లో న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధించడంతో మహిళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో యువకుడు నంద్యాల (D)కి చెందిన వెల్లపు గురునాథ్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
News September 6, 2025
మాజీ MLA ప్రసన్న బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

కోవూరు మాజీ MLA నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్లే హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారంటూ అయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రసన్న కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయమూర్తి 8కి వాయిదా వేశారు.