News September 6, 2025

విశాఖ: ఫొటో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడి అరెస్ట్

image

మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధించడంతో మహిళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో యువకుడు నంద్యాల (D)కి చెందిన వెల్లపు గురునాథ్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

Similar News

News September 6, 2025

BREAKING: CBI డైరెక్టర్‌ ప్రవీణ్‌కు అస్వస్థత

image

TG: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి HYD వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా కాళేశ్వరం, న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులను విచారించేందుకే ఆయన హైదరాబాద్ వచ్చారని వార్తలు వస్తున్నాయి.

News September 6, 2025

కేటీఆర్ భద్రాచలం పర్యటన వాయిదా: BRS

image

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భద్రాచలం పర్యటన వాయిదా పడినట్లు బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రామ్‌ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 10, 11న భద్రాచలంలో జరగాల్సిన కేటీఆర్ పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడిందని, తదుపరి పర్యటన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని సూచించారు.

News September 6, 2025

HNK: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలు

image

హనుమకొండ జిల్లాలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగినట్లు ఉపాధ్యాయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తొలుత గురువారం సాయంత్రం 48 మందితో విద్యాశాఖ లిస్ట్‌ను విడుదల చేసింది. అదే రోజు అర్ధరాత్రి లిస్ట్‌ను 40కి కుదించించారు. శుక్రవారం అవార్డుల కార్యక్రమ ప్రారంభంలో 55 మందికి లిస్ట్ చేరింది. ఇక అవార్డులు మాత్రం 62 మందికి ప్రదానం చేశారు. డీఈవో వాసంతి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.