News September 6, 2025

UPDATE: సాగర్ కాలువలో కొట్టుకుపోయిన తండ్రీకొడుకులు వీరే

image

వేములపల్లి మండలం సాగర్ ఎడమ కాలువలో తండ్రీకొడుకులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిన సాంబయ్య (45), శివసాయి(20)లను గజ ఈతగాళ్లు రక్షించేందుకు యత్నించినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే, డీఎస్పీ పరిశీలించారు.

Similar News

News September 6, 2025

NLG: వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా మృతి

image

వినాయక నిమజ్జనంలో శుక్రవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం, మర్రిగూడెం గ్రామానికి చెందిన ఏశబోయిన యాదయ్య(45) వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చుని ప్రమాదవశాత్తు పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News September 6, 2025

NLG: కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లు చేసుకుంటూ వెళుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ప్రకటించిన విషయం విదితమే. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జాబితాల రూపకల్పన ఇలా.. ఎన్నికలకు ముందస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉండటంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

News September 6, 2025

నల్గొండ జిల్లాలో 4 వేల విగ్రహాల నిమజ్జనం

image

జిల్లావ్యాప్తంగా 5,984 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించగా.. సుమారు 4 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలురాయి, MLG, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, DVK, కొండ బీమనపల్లి, డిండి వద్ద పెద్ద సంఖ్యల విగ్రహాలను నిమజ్జనం చేశారు.