News September 6, 2025
బీచ్ క్రీడా పోటీలు అంబరాన్ని అంటాలి: బాపట్ల కలెక్టర్

దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫ్లడ్ లైట్ల మధ్య వాలీబాల్, కోకో, బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు.
Similar News
News September 6, 2025
ఏక్లవ్య ఓటీటీలో ప్రపంచస్థాయి విద్య

HYD కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఏక్లవ్య ఓటీటీ ప్లాట్ఫారాన్ని ప్రటించింది. దీనిద్వారా ప్రపంచస్థాయి విద్య అందుతుందని, పేస్ బేస్డ్ సిస్టమ్ నుంచి మాస్టరీ బేస్డ్ సిస్టమ్ వైపు అడుగు పెడుతున్నట్లు పేర్కొంది. అత్యుత్తమ ఉపాధ్యాయుల వద్ద విద్యార్థులు విద్య నేర్చుకునేందుకు వీలుగా ఈ ప్లాట్ ఫారమ్ నిర్మించినట్లు డైరెక్టర్ సంతోశ్ రెడ్డి, MLA సుధీర్ రెడ్డి ప్రారంభ కార్యక్రమంలో తెలిపారు.
News September 6, 2025
ఈ నెల 9న ‘అన్నదాత పోరు’: YCP

AP: యూరియా కొరత, రైతుల సమస్యలపై నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న ‘అన్నదాత పోరు’ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆ రోజు ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్ను పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News September 6, 2025
KNR: Way2news కథనానికి స్పందన..!

‘విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం’ అనే శీర్షికన ప్రచురితమైన Way2News కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. విగ్రహానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర ముందుకు సాగనుంది. శోభాయాత్ర అనంతరం చింతకుంట కెనాల్లో స్వామివారిని నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా మిత్రా యూత్ సభ్యులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.