News September 6, 2025

బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ ఇదే..!

image

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్‌ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.

Similar News

News September 6, 2025

భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

image

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.

News September 5, 2025

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న మహేశ్‌గౌడ్

image

ఖైరతాబాద్ బడా గణేశ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయనను సత్కరించి విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుకరించారు.

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.