News September 6, 2025
అమీన్పూర్లోనే నవోదయ పాఠశాల: ఎంపీ

సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను అమీన్పూర్లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై నవోదయ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరాకు శనివారం వినతిపత్రం సమర్పించారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.1500 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అధికారులు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
Similar News
News September 6, 2025
NLG: ‘తెలంగాణలో అందుకే యూరియా కొరత’

తెలంగాణలో గత నెల రోజులుగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరతపై ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం నల్గొండలో ఆయన ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. రైతులు వచ్చే సీజన్కు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకే యూరియా కోసం క్యూలైన్లలో బారులు తీరుతున్నారని ఆరోపించారు. రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు.
News September 6, 2025
తిరుపతి: పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

తిరుపతి అలిపిరి పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రమ్య(6 నెలలు) మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బహిర్భూమికి ఇద్దరు కుమార్తెలను తల్లి చందన తీసుకెళ్లింది. చందన చేతిలో నుంచి రమ్య జారి కాలువలో పడింది. బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయగా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులకు భయపడి కనిపించడంలేదని తెలిపినట్లు సమాచారం.
News September 6, 2025
కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.