News September 6, 2025

ఈనెల 8న ఎచ్చెర్ల ఐటీఐ కాలేజీలో అప్రెంటీస్ మేళా

image

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 8న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌ఛార్జి సాయిబాబు శనివారం తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ 11 కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు గుర్తింపు కార్డు, 4 రెస్యూమ్ కాపీలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

Similar News

News September 6, 2025

ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా వర్శిటీ ఈ.సి.ఈ. విద్యార్థి

image

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ (ఈ.సి.ఈ.) విభాగానికి చెందిన బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ.)గా ఎంపికయ్యారు. ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమల నిర్వహణకు ప్రదీప్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. ఎంపికపట్ల వర్శిటీ వీసి రజని శనివారం ప్రత్యేకంగా అభినందించారు.

News September 6, 2025

శ్రీకాకుళం: రేషన్ లబ్ధిదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి

image

రేషన్ లబ్ధిదారులతో డీలర్లు స్మేహపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి రేషన్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులతో సానుకూలదృక్పదంతో, కుటుంబ సభ్యుల్లా మాట్లాడాలన్నారు. సహనంతో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ధరలకే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలన్నారు.

News September 6, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పూర్తి చేశారా..ఈ అవకాశం మీకోసమే

image

ఇంటర్మీడియేట్ వృత్తి, విద్యా కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ మేళా జరగనుంది. ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. అప్రెంటిస్ ఎంపికలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు కన్వీనర్ అన్నారు.