News September 6, 2025
ప్రకాశం: హిజ్రాలకు గుడ్ న్యూస్.. ఈ శిక్షణ వారికే.!

ప్రకాశం జిల్లాలోని హిజ్రాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒంగోలులో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన హిజ్రాలకు జాతీయస్థాయి IT రంగాల్లో నైపుణ్యత పెంచేందుకై ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు
ఇవ్వాలన్నారు.
Similar News
News September 6, 2025
ఒంగోలు: 12న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 12వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహిస్తారని, ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభించడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధికారులందరూ హాజరుకావాలని ప్రకటన ద్వారా కోరారు.
News September 6, 2025
కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.
News September 6, 2025
ప్రకాశం: 13 మందికి కారుణ్య నియామక పత్రాల పంపిణీ

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య నియామక కోటాలో ఉద్యోగం పొందిన 13 మందికి శనివారం ఒంగోలులో ఆమె నియామక పత్రాలను ఇచ్చారు. ఆడిట్, రెవెన్యూ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్, కార్మిక శాఖల్లో వీరికి ఉద్యోగాలు కల్పించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకునేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.