News September 6, 2025

కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

image

GST సవరణలో భాగంగా పలు కార్ల ధరలు భారీగా తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. కానీ మహీంద్రా కంపెనీ ముందే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే వారి SUV వాహనాలపై జీఎస్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Similar News

News September 6, 2025

హాకీ ఆసియా కప్: ఫైనల్‌కు భారత్

image

భారత్‌లో జరుగుతున్న హాకీ ఆసియా కప్‌ సెమీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. బిహార్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0గోల్స్‌తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో 9సార్లు ఆసియా కప్ ఫైనల్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో జరగనుంది. తుదిపోరులో గెలిచిన జట్టు 2026 FIH హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది.

News September 6, 2025

జీఎస్టీ సంస్కరణలు.. ధన్యవాదాలు తెలిపిన నిర్మల

image

GST సంస్కరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులకు లేఖలు రాశారు. పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినా, చివరకు GST కౌన్సిల్ నిర్ణయాలతో ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలతో పాటు కేంద్రమూ ఆదాయం కోల్పోతుందని, రేట్లు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయాలు భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.

News September 6, 2025

వైసీపీ ‘ఉల్లి’ వీడియోలకు టీడీపీ కౌంటర్

image

AP: రాష్ట్రంలో <<17631026>>ఉల్లి రైతులకు<<>> ఎలాంటి సమస్య లేకుండా కూటమి సర్కార్ పనిచేస్తోందని TDP ట్వీట్ చేసింది. కానీ YCP తమ కార్యకర్తలతో దీనిపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పోలకల్‌కు చెందిన గుండ్లకొండ కృష్ణ, వెంకటనాయుడు YCP కార్యకర్తలు. వారు కావాలనే ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యం కలుపుకుని తాగారు. వారి ఉల్లికి క్వింటాకు రూ.800 ఇస్తామన్నా తిరస్కరించారు’ అంటూ పేర్కొంది.