News September 6, 2025
SPMVV: పీజీ ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో ఎమ్మెస్సీ (M.Sc) స్టాటస్టిక్స్, ఎమ్మెస్సీ (M.Sc) సెరికల్చర్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Similar News
News September 7, 2025
టర్మినేట్ అయిన 43 మంది పునఃనియామకం

సింగరేణిలో జేఎంఈటీలుగా చేరి టెర్మినేట్ అయిన 43 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎండీ ఎన్.బలరాం నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీరంతా విధులకు గైర్హాజరవడం, ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీరిని తిరిగి తీసుకుంటున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు.
News September 7, 2025
చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి స్పందించట్లేదని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దత గల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 15 వేల పోస్టులతో మెగా DSC, 7,500 పోస్టులతో GPO నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్యాగాలు మావీ.. భోగాలు మీవా అంటూ నినాదాలు చేశారు.
News September 7, 2025
NZB: పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా బందోబస్తు పరిశీలన

నిజాముబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన రథోత్సవ వేడుకలు కన్నుల పండువ కొనసాగింది. ఇందు కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను సీపీ సాయి చైతన్య ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడూ పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వినాయక రథోత్సవ వేడుకలను వీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టిగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.