News September 6, 2025

ప్రకాశం: గణేష్ నిమజ్జనోత్సవంలో విషాదం.. ఇద్దరు మృతి

image

ప్రకాశంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తపట్నం మండలం గుండమాల తీరంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన భక్తులలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మోటుమాలకు చెందిన కొందరు నిమజ్జోత్సవంలో పాల్గొనేందుకు గుండమాల తీరం వద్దకు వెళ్లారు. గణనాథుడి నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఇద్దరు తీరంలోకి వెళ్లగా.. ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 7, 2025

ప్రకాశం వైద్య ఆరోగ్య శాఖ ఖాళీ సీట్ల.. మెరిట్ లిస్ట్ విడుదల!

image

జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సెస్, ఎఫ్ఎన్ఓ, ఎస్ఏడబ్ల్యు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల మెరిట్, తిరస్కరణ లిస్ట్ విడుదల చేసినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://Prakasam.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

News September 6, 2025

ఒంగోలు: 12న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 12వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహిస్తారని, ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభించడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధికారులందరూ హాజరుకావాలని ప్రకటన ద్వారా కోరారు.

News September 6, 2025

కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

image

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.