News September 6, 2025

స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న వడ్డాది ప్రిన్సిపల్

image

వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.చిన్నారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో స్వీకరించారు.16 ఏళ్ల నుంచి ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాదికి ప్రిన్సిపల్‌గా వచ్చారు

Similar News

News September 7, 2025

KMR: ఉత్తమ ఉపాధ్యాయులకు 8న అవార్డులు ప్రదానం

image

కామారెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందిస్తున్న 41 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 8న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేసి, శాలువాలతో సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.GHM,LFLHM, SA, SGT, PD, SO, CRT తదితర హోదాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

News September 7, 2025

అరకు: ‘ఆ ప్రాజెక్టుతో 150 గ్రామాలు జలసమాధి’

image

5వ షెడ్యూల్ ఏరియాలో చేపట్టాలనుకునే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అరకులోయ వచ్చిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాలు అందిచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం డ్యాం నిర్మిస్తే అనంతగిరి, హుకుంపేట, అరకులోయ మండలాల్లో సుమారు 150 గిరిజన గ్రామాలు జలసమాధి అవుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.

News September 7, 2025

KNR: మంత్రులూ.. జర రైతులను పట్టించుకోండి..!

image

ఉమ్మడి KNR జిల్లాలో ఓ పక్క భారీ వర్షాలతో పంట నష్టం, మరోపక్క యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉంటూ భరోసా కల్పించాల్సిన మంత్రులు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట పరిహారం ఎప్పుడు ఇస్తారు? యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారు? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు.