News September 6, 2025
గుజరాత్లో ప్రమాదం.. పల్నాడు యువకుడి మృతి

ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన కొడవటి నరేశ్ (17) గుజరాత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్నేహితులతో కలిసి ఎస్యూవీ వాహనంలో టూర్కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వాహనం అదుపు తప్పడంతో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మరణించగా, వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారని పేర్కొన్నారు.
Similar News
News September 8, 2025
మాతా, శిశు వైద్యసేవలు విస్తరిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

AP: ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు, కాకినాడ GGHలలో 500 చొప్పున పడకలతో 2 బ్లాకులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా చోట్ల రూ.51కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త బ్లాకుల కోసం ICU బెడ్లు, పేషెంట్ మానిటర్లు, వెంటిలేటర్లు, మొబైల్ అల్ట్రా సౌండ్ మెషీన్లు తదితరాలు భారీ స్థాయిలో కొనుగోలు చేయనున్నారు.
News September 8, 2025
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ
☞ మచిలీపట్నం: పర్యాటకుల జేబులకు చిల్లు.!
☞ మోపిదేవిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
☞ గుడివాడ- కంకిపాడు రోడ్లో గుంతలో పడి వ్యక్తి మృతి
☞ మొవ్వలో రూ.1.70 లక్షల విలువైన యూరియా సీజ్
☞పోరంకిలో విజయవాడ ఉత్సవ్ సన్నాహక కార్యక్రమం
☞ జూపూడిలో మందు గుండు సామాగ్రి కలకలం
☞ అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యేకి వైసీపీలో కీలక పదవి
News September 8, 2025
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

చిలమత్తూరులో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవి(35)తో వాగ్వాదానికి దిగిన రాఘవేంద్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో నరికి హతమార్చాడు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.