News September 6, 2025

HYD: మెట్రో మిడ్‌ నైట్.. MMTS నైట్ ఔట్

image

గణపతి నిమజ్జనం వేళ HYD మెట్రో, MMTS సేవలు పొడిగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సేవలు ఉంటాయి. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్‌-ఫలక్‌‌నుమా, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య 8 MMTS రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
SHARE IT

Similar News

News September 8, 2025

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3‌తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్‌ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.

News September 8, 2025

ORR: తాగునీరు అందే ప్రాంతాలు ఇవే

image

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 14 మండలాల్లోని 25 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, RCపురం, పటాన్‌చెరు, బొల్లారం ప్రాంత వాసులకు మంచినీరు అందించనున్నారు.

News September 8, 2025

హైదరాబాద్‌కు గోదావరి.. నేడే పునాది

image

భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌‌కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్‌సాగర్‌ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.