News September 6, 2025
తిరుపతి: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉంది అంటూ ఓ జంట చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం, మర్లమిట్ట గ్రామానికి చెందిన ఓ యువకుడు, శ్రీ కాళహస్తి మండలం, తొండమనాడు గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం చేసుకుని శనివారం చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తరుఫున తమకు ప్రాణహాని ఉందని, రక్షించాలని పోలీసులను వారు కోరారు.
Similar News
News September 8, 2025
రజినీకాంత్తో పోటీ లేదు: కమల్ హాసన్

రజినీకాంత్కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
News September 8, 2025
యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: MHBD కలెక్టర్

యూరియా పంపిణీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కేంద్రాల నిర్వహణ, యూరియా పంపిణీ శనివారం, ఆదివారం తీసుకున్న చర్యలపై కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార శాఖ సంబంధిత సిబ్బందితో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
News September 8, 2025
భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.