News September 6, 2025

ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పదోన్నతుల వల్ల ఖాళీ అయిన ఉపాధ్యాయ పోస్టులను అదే మండలం లేదా పక్క మండలంలో అందుబాటులో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Similar News

News September 8, 2025

రజినీకాంత్‌తో పోటీ లేదు: కమల్ హాసన్

image

రజినీకాంత్‌కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

News September 8, 2025

యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: MHBD కలెక్టర్

image

యూరియా పంపిణీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కేంద్రాల నిర్వహణ, యూరియా పంపిణీ శనివారం, ఆదివారం తీసుకున్న చర్యలపై కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార శాఖ సంబంధిత సిబ్బందితో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

News September 8, 2025

భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

image

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.