News September 6, 2025

భాద్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పాలనాధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. నియామక పత్రాలు తీసుకున్న అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

బీచ్ ఫెస్టివల్‌‌పై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

బాపట్లలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు రావాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బీచ్ ఫెస్టివల్‌పై అధికారులతో సమీక్ష జరిగింది. సూర్యలంక సముద్ర తీరం మరొక గోవాగా అభివృద్ధి చెందాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో బాపట్లలో వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. బావుడా ఛైర్మన్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.

News September 8, 2025

మహాలయ పక్షాలు అంటే ఏంటి?

image

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

News September 8, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).