News September 6, 2025
కామారెడ్డి: GPOలు అంకిత భావంతో పనిచేయాలి: కలెక్టర్

జిల్లాలో ఎంపికైన GPOలు అంకిత భావంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. శనివారం GPOలు మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. గ్రామాల్లో రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నియమించిందని గుర్తు చేశారు.
Similar News
News September 8, 2025
ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది.
News September 8, 2025
రాజీ దారిలోనే కేసుల పరిష్కారం: వరంగల్ సీపీ

ఈనెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఈరోజు సీపీ మాట్లాడుతూ.. రాజీ ద్వారా పరిష్కరించగల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. “రాజీయే రాజమార్గం” అని ఆయన స్పష్టం చేస్తూ, చిన్న కేసులను రాజీ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
News September 8, 2025
14న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి- SP జానకి

త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘రాజీయే రాజమార్గం.. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఈ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని’ అన్నారు.