News April 3, 2024

మీ ఓటు విలువ మీ ఐదేళ్ల భవిష్యత్: జగన్

image

AP: ప్రజల ఓటు విలువ వారి ఐదేళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ అన్నారు. ‘ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు.. చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నా. ఒక్కడి మీద అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు. మీ ఓటు వల్ల మీ తలరాతలు మారతాయి. ఎవరి వల్ల మంచి జరిగిందో తెలుసుకుని ఓటేయండి. ఈ ఎన్నికల్లో వైసీపీకి తోడుగా ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 22, 2025

పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

image

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News April 22, 2025

MI ఆటగాళ్లలో స్ఫూర్తినింపిన పొలార్డ్!

image

నిన్న రాత్రి CSKపై మ్యాచ్‌కు ముందు MI ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా స్పీచ్ ఇచ్చినట్లు పొలార్డ్ తెలిపారు. ‘ఆటగాళ్లతో మాట్లాడేందుకు మహేల నాకు ఛాన్స్ ఇచ్చారు. గడచిన రెండేళ్లుగా చెన్నై ఆటగాళ్లకు ‘బాగా ఆడారు’ అని చెప్పడమే సరిపోయింది. ఈసారి అలా ఉండకూడదు అని అన్నాను. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడి విజయాన్ని అందించారు’ అని చెప్పుకొచ్చారు. స్పిన్నర్లను ఆడేందుకే సూర్యను 3వ స్థానంలో పంపించినట్లు ఆయన వివరించారు.

News April 22, 2025

DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

error: Content is protected !!