News September 7, 2025
చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి స్పందించట్లేదని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దత గల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 15 వేల పోస్టులతో మెగా DSC, 7,500 పోస్టులతో GPO నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్యాగాలు మావీ.. భోగాలు మీవా అంటూ నినాదాలు చేశారు.
Similar News
News September 8, 2025
ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.
News September 8, 2025
ORR: తాగునీరు అందే ప్రాంతాలు ఇవే

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 14 మండలాల్లోని 25 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, RCపురం, పటాన్చెరు, బొల్లారం ప్రాంత వాసులకు మంచినీరు అందించనున్నారు.
News September 8, 2025
హైదరాబాద్కు గోదావరి.. నేడే పునాది

భవిష్యత్లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్సాగర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.