News April 3, 2024
మరమరాలు ఆరోగ్యానికి మంచివేనా?

తెలుగు రాష్ట్రాల్లో మరమరాలతో ఉగ్గాని, లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్ లాంటి స్నాక్స్ తయారు చేసుకుని తింటుంటారు. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరమరాల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గిస్తుంది. ఇవి తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు, పేగు ఆరోగ్యానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
Similar News
News April 18, 2026
చంద్రబాబుకూ నితీశ్, షిండే పరిస్థితే: సీఎం రేవంత్

TG: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మాదిరే భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో తక్కువ సీట్లు ఉన్నాయని టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో పేర్కొన్నారు.
News April 18, 2026
BREAKING: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, రజత్, జితేశ్,డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, హేజిల్వుడ్, సుయాష్
DC: KL రాహుల్, నిస్సాంక, రిజ్వీ, అక్షర్, మిల్లర్, స్టబ్స్, నబీ, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముఖేశ్
News April 18, 2026
మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?


