News September 7, 2025
ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Similar News
News September 7, 2025
రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.
News September 6, 2025
భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.
News September 6, 2025
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ ఇదే..!

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.