News September 7, 2025

పైడిమాంబ ఆలయంలో నేడు దర్శనాలు నిలిపివేత

image

ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి శ్రీ పైడిమాంబ ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నామని.. తిరిగి సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిపించి దర్శనాలు కల్పిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News September 8, 2025

VZM: రూ.40 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్

image

ప్రైవేటుగా అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్, పోలీస్ అధికారులతో ముమ్మర తనిఖీలు జరిపించి, అధిక ధరలను అరికడతామని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం తన ఛాంబర్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 411 చోట్ల తనిఖీలు నిర్వహించి, ఒక FIR నమోదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.40 లక్షలు విలువ గల 172 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను సీజ్ చేశామన్నారు.

News September 8, 2025

VZM: కలెక్టరేట్లో నేడు యధావిధిగా PGRS

image

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 7, 2025

పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

image

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.