News April 3, 2024
NZB: బాలికకు లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన 9తరగతి విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ లైంగిక వేధించసాగాడు. సదరు బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు వివరించింది. వారు షీ టీంను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన షీటీం విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసింది.
Similar News
News April 16, 2026
NZB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు: సీపీ

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు CP సాయి చైతన్య తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు సీపీ వెల్లడించారు.
News April 16, 2026
NZB: పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం: కలెక్టర్

పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాల్లో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పసుపు క్వింటాకు సగటున రూ.16,000 ధర లభిస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని సూచించారు.
News April 16, 2026
NZB: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు: DCC అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్వేర్లో NZB మార్కెట్ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.


