News September 7, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లైవ్ చికెన్ kg ధర రూ.160 నుంచి 180 కాగా.. స్కిన్ చికెన్ కేజీ ధర రూ.190 నుంచి రూ.210 మధ్యగా ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం స్వల్పంగా ధరలు పెరిగినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News September 9, 2025
‘స్వదేశీ మేళా’లు నిర్వహించండి.. NDA ఎంపీలకు ప్రధాని పిలుపు

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
News September 9, 2025
పంజాబ్ వరదలు.. భజ్జీ మంచి మనసు

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
News September 9, 2025
జాఫర్గఢ్: పెట్టుబడి దారి సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: రాపర్తి రాజు

పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. జఫర్గఢ్ మండలం తమ్మడపల్లిలో సీపీఎం మండల రాజకీయ శిక్షణా తరగతులను ఈరోజు ప్రారంభించారు. రాపర్తి రాజు పాల్గొని సీపీఎం జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ సమాజానికి కాలం చెల్లిందని, భవిష్యత్ సోషలిజం, ఎర్రజెండానే అని అన్నారు.