News April 3, 2024
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలను చేపట్టండి: జేసీ

భీమవరం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ ప్రవీణ్ ఆదిత్య పౌరసరఫరాలు, వ్యవసాయ, కోపరేటివ్ శాఖ, తూనికల, కొలతలు అధికారుల, జిల్లా రైస్ మిల్లర్స్ సంఘంతో సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. గ్రేడ్ ఎరకం క్వింటాకు
రూ.2203 అందించి, ధాన్యం సేకరణ చేయాలన్నారు.
Similar News
News March 11, 2026
ప.గో: లైంగిక దాడి కేసులో పదేళ్లు జైలు

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి భీమవరం పోక్సో కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. 2021లో నడిపూడికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదైంది. తర్వాత నిందితుడు గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.
News March 11, 2026
ఏకీకృత కుటుంబాల నమోదు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్లో ఉన్న 27,865 ఏకీకృత కుటుంబాల నమోదు ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఎంఎస్ఈవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ గ్రామ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేలను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.
News March 10, 2026
అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.


