News September 7, 2025
నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

TG: తాను BRSలోనే ఉన్నానని, వేరే ఏ పార్టీ కండువా కప్పుకోలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్ నోటీస్కు సమాధానం ఇచ్చానని, సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచానని పేర్కొన్నారు. కాగా BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించిన విషయం తెలిసిందే.
Similar News
News September 8, 2025
లిక్కర్ కేసు నిందితులకు నోటీసులు!

AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
News September 8, 2025
చరిత్ర సృష్టించిన తెలంగాణ ఆర్చర్ చికిత

ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.
News September 8, 2025
బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.