News September 7, 2025

మేడ్చల్: మరణంలోనూ వీడని బంధం

image

గుండెపోటుతో భర్త మృతి చెందగా, భార్య సైతం అరగంటలోనే కన్నుమూసిన విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. నాగారం మున్సిపాలిటీ ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న జంభాపురం నారాయణరెడ్డి(70) గుండెపోటుతో మృతి చెందగా భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఇందిర(65) అరగంటలోనే ప్రాణాలు విడిచారు. జీవితాంతం కలిసి బతికిన ఈ దంపతులు మరణంలోనూ విడిపోలేదని స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.

Similar News

News September 9, 2025

జగన్‌ను జైల్లో పెడతారా? లోకేశ్ సమాధానమిదే!

image

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్‌ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.

News September 9, 2025

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

image

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.

News September 9, 2025

సంగారెడ్డి: రాష్ట్రస్థాయి యోగా పోటీలో విద్యార్థులకు పతకాలు

image

నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులకు పతకాలు వచ్చినట్లు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ సోమవారం తెలిపారు. జూనియర్ విభాగంలో నిహారిక, నిఖితకు వెండి, సబ్ జూనియర్ విభాగంలో సంధ్య, పవిత్రకు రజతం, బాలుర విభాగంలో సంతోశ్, వసంతరావుకు వెండి పతకాలు వచ్చినట్లు చెప్పారు. షణ్ముక ప్రియాకు రాష్ట్ర స్థాయిలో నాలుగు, దివ్యశ్రీ ఐదవ స్థానం సాధించినట్లు తెలిపారు.