News April 3, 2024
వీరికి సాయం చేయడం తృప్తి కలిగించింది: సీఎం రేవంత్

TG: గతంలో దుండగుల కాల్పుల్లో అకాలమరణం చెందిన జవాన్ యాదయ్య కుటుంబానికి సాయం అందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ‘నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదెకరాల భూమి, ఆయన భార్య సునితమ్మకు ఉద్యోగం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్న తృప్తి కలిగింది’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.
News March 19, 2026
అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.
News March 19, 2026
కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>


