News September 7, 2025

VKB: అండర్-17 క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థులు

image

వికారాబాద్ జిల్లా ఎంకేపల్లిలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల జరిగిన అండర్-17 క్రికెట్ పోటీలలో గెలుపొందారు. ఈ జట్టుకు మహనీత ప్రవికర్ నాయకత్వం వహించారు. పీఈటీ దోమ వెంకట పర్యవేక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు చక్కగా రాణించారని ప్రిన్సిపల్ శ్రీమతి సరళ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో నేనావత్ మహనీత్, ప్రవికర్, వి.ధనుశ్ ఉన్నారు.

Similar News

News September 9, 2025

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.

News September 9, 2025

విజయవాడ: బీచ్‌లో యువకుడి మృతి

image

విజయవాడ నుంచి బాపట్ల సూర్యలంక తీరానికి వచ్చిన యువకుడు అలల తాకిడికి గల్లంతై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి వచ్చిన సాయి తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. గల్లంతయిన యువకుడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ప్రారంభించగా కాసేపటికి మృత దేహం లభ్యమైంది.

News September 9, 2025

కరీంనగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యం

image

ఉమ్మడి KNRలో పలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా డయాగ్నొస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా విజిటింగ్ డాక్టర్స్‌తో వైద్యం చేయిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హాస్పిటల్స్‌పై అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైద్యం పేరుతో వేల ఫీజులు తీసుకుంటూ సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.