News September 7, 2025
దళితులపై దాడి.. ఏడుగురు నిందితుల అరెస్టు

కైకలూరు పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనాల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కైకలూరు టౌన్లో శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనంలో బండి హారన్ కొట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దాన గూడెం కి చెందిన కొందరు గాయాల పాలయ్యారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
Similar News
News September 9, 2025
సంగారెడ్డి: విద్యార్థులకు తక్షణమే వైద్యం అందించాలి: మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటన జరిగిన గురుకుల పాఠశాలను పరిశీలించాలని కలెక్టర్ ప్రావీణ్యకు ఆదేశించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడిన విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్సలు అందించాలన్నారు.
News September 9, 2025
మెదక్: ప్రజాకవి కాళోజీకి ఎస్పీ నివాళులు

జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 9, 2025
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.