News April 3, 2024
విశాఖ: ‘వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు’

ఒకరు విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, మరొకరు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ యాదృచ్ఛికంగా సంపత్ వినాయగర్ ఆలయంలో కలుసుకున్నారు. పార్టీలను పక్కనపెట్టి ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో తనను బలపరచాలని వాసుపల్లి విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 2, 2025
గోపాలపట్నంలో విచ్చలవిడిగా నాన్వెజ్ అమ్మకాలు

గాంధీ జయంతి సందర్భంగా నేడు మాంసాహారం దుకాణాలు తెరవొద్దని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే దసరా కావడంతో గోపాలపట్నం ప్రాంతంలో చికెన్, మటన్ షాపుల యజమానులు బహిరంగంగానే గురువారం అమ్మకాలు జరుపుతున్నాయి. అధికారులు ప్రకటనలతోనే సరిపెట్టుకుంటున్నారని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
News October 2, 2025
విశాఖలో అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల అహ్వానం

విశాఖలో 53 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ICDS పీడీ రామలక్ష్మి తెలిపారు. భీమునిపట్నం జోన్లో 11, పెందుర్తిలో 21, విశాఖలో 21 ఖాళీలు ఉన్నాయన్నారు. 7వ తరగతి పాస్ అయి 21-35 ఏళ్ల లోపు గల స్థానిక వివాహితులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వీకరించనున్నామన్నారు.
News October 2, 2025
విశాఖ: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విశాఖలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102 నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8500834958, బీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8074425598 అందుబాటులో తీసుకువచ్చినట్లు బుధవారం వెల్లడించారు.