News September 8, 2025
హైదరాబాద్కు గోదావరి.. నేడే పునాది

భవిష్యత్లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్సాగర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News September 9, 2025
HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
News September 9, 2025
బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News September 9, 2025
పన్ను వసూళ్లకు GHMCకు కొత్త టెక్నిక్!

GHMC తన ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. TGSPDCL సహకారంతో ఆస్తి పన్ను ఐడీ నంబర్లను (PTIN) విద్యుత్ కనెక్షన్లతో (USC) అనుసంధానం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 6 GHMCలోని జోన్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 96,938 నివాస ఆస్తుల పన్ను ఐడీలు విజయవంతంగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం అయ్యాయని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు.