News September 8, 2025

కర్నూలు: హృదయాన్ని పిండేసే ఘటన

image

ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలిని వదిలి వెళ్లిన దృశ్యం హృదయాన్ని పిండేసింది. 2 రోజులుగా ఆమె రోడ్డు పక్కనే ఉంటూ ఎవరైనా ఆహారం ఇస్తే తిని జీవించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వేదాస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన సునీల్ కుమార్, చికెన్ బాషా ఆమెకు ప్రేమతో సపర్యలు చేశారు. ఆటోలో ఆదోనిలోని జీవన జ్యోతి ఆశ్రమానికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు.

Similar News

News September 10, 2025

మెట్‌పల్లి నుంచి RTC ప్రత్యేక TOUR

image

MTPL నుంచి ఈనెల 12న టూర్ ఏర్పాటు చేసినట్లు DM దేవరాజ్ తెలిపారు. బీదర్ స్వయంభూ వినాయక, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, హుమ్నాబాద్ మాణిక్ ప్రభు ఆలయం, గుల్బర్గా, గనుగాపూర్ దత్తాత్రేయ ఆలయం, అక్కలకోట స్వామి సమర్థ ఆలయం, పండరిపూర్, విట్టల్, తుల్జాపూర్, పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాందేడ్ సిక్ గురుద్వార దర్శనమనంతరం తిరిగి 14న
బస్సు మెట్‌పల్లి చేరుకుంటుందన్నారు. ఛార్జీ రూ.4000. వివరాలకు: 9959225927.

News September 10, 2025

చిత్తూరు DFO భరణి బదిలీ

image

చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

News September 10, 2025

MHBD: క్యాన్సర్ కేర్ యూనిట్ ప్రారంభం

image

MHBD జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ యూనిట్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శాఖ మంత్రి రాజ నర్సింహ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. MNJ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లాలోని 160 మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సేవలు అందించనున్నారు.