News April 3, 2024

‘కనీసం రూ.కోటి సంపాదించే వాడు కావాలి’.. మహిళ ప్రపోజల్

image

సాధారణంగా తనను బాగా చూసుకునే భర్త కావాలని మహిళలు కోరుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 37ఏళ్ల మహిళ రిక్వైర్మెంట్ చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఏడాదికి రూ.4లక్షలు సంపాదించే ఈమెకు కనీసం రూ.కోటి సంపాదించే వరుడు కావాలని పేర్కొంది. ముంబైలో సొంతిల్లు, స్థిరమైన ఉద్యోగంతో పాటు బాగా చదువుకున్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలట. సర్జన్ లేదా CAకి ప్రాధాన్యం ఇస్తుందట. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 19, 2025

విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

image

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్‌తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్‌లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.

News September 19, 2025

దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

image

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.

News September 19, 2025

పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

image

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.