News September 8, 2025

భద్రాచలం: 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.

Similar News

News September 9, 2025

ఖమ్మం: పోక్సో కేసుల్లో నిందితులు తప్పించుకోలేరు: డీసీపీ

image

18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం కఠినంగా అమలవుతోందని, నిందితులు తప్పించుకునే అవకాశం లేదని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన భరోసా కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో రాజీకి అవకాశం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడతాయని తెలిపారు.

News September 8, 2025

స్థానిక ఎన్నికల జాబితాపై అఖిలపక్ష సమావేశం

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 8, 2025

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.