News September 8, 2025

ములుగు: నిండు కుండల్లా జలాశయాలు..!

image

ములుగు జిల్లాలోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. రామప్ప, లక్నవరం చెరువులు, మల్లూరు, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఆయకట్టు పొలాలకు నీటి కొరత తీరినట్లే. ఒక్కసారి నిండితే రెండు పంటలకు సంవృద్ధిగా నీరు లభిస్తుంది. కానీ, లక్నవరం చెరువు, మల్లూరు ప్రాజెక్టుల్లో లీకేజీ కారణంగా జలాలు వృథాగా పోతున్నాయి. ప్రాధాన్యతగా మరమ్మతులు చేయాల్సి ఉంది.

Similar News

News September 9, 2025

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తికి రూ.7,530 ధర పలకగా.. ఈరోజు రూ.7,580కి చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 9, 2025

ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.

News September 9, 2025

విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.