News September 8, 2025
ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు.. ఏడ్చేశా: గేల్

IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్పై మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. టోర్నీ పాపులారిటీకి ఎంతో కృషి చేసినా, ఫ్రాంచైజీకి విలువ తేగల నన్ను చిన్నపిల్లాడిలా చూశారు. జీవితంలో ఫస్ట్ టైమ్ డిప్రెషన్లోకి వెళ్లా. కుంబ్లేతో మాట్లాడినప్పుడు ఏడ్చేశా’ అని చెప్పుకొచ్చారు. రాహుల్ తనను జట్టులోనే ఉండాలని చెప్పాడని, కానీ బ్యాగ్ సర్దుకొని వచ్చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News September 9, 2025
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల మరణించారు.
News September 9, 2025
ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు: TDP

AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.
News September 9, 2025
నేపాల్ రణరంగం.. దుబాయ్ పారిపోయేందుకు PM ప్లాన్

నేపాల్లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.