News September 8, 2025

BREAKING: ఈనెల 21 నుంచి దసరా సెలవులు

image

తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Similar News

News September 8, 2025

వెరైటీ ఆఫర్.. బరువు తగ్గితే డబ్బులు

image

ఉద్యోగులు ఫిట్‌గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.

News September 8, 2025

కుల్గాం ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికుల వీరమరణం

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

News September 8, 2025

‘ఆమె లేని లోకంలో నేను ఉండలేను’.. ప్రియుడి సూసైడ్

image

TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.