News September 8, 2025

రూ.94వేల కోట్లలో రూ.250 కోట్లు నష్టం: కేటీఆర్

image

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని KTR విమర్శించారు. ‘మేడిగడ్డను రెండేళ్లుగా పక్కనబెట్టారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు అయితే మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగి రూ.250 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మేమే రిపేర్ చేస్తామని ఏజెన్సీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదు’ అని ఫైరయ్యారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లిస్తున్నారని తెలిపారు.

Similar News

News September 9, 2025

BREAKING: నేపాల్ ప్రధాని రాజీనామా

image

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.

News September 9, 2025

హనుమంతుడి విగ్రహాలు నారింజ రంగులో ఎందుకు?

image

హనుమంతుడు భక్తి తత్పరుడు. ఆయన విగ్రహాలు, జెండా అన్ని నారింజ రంగులోనే దర్శనమిస్తాయి. ఓరోజు సీతాదేవి నుదుటన ఆంజనేయుడు కుంకుమను గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని అడిగాడు. అప్పుడు జానకీ దేవి ఆ సిందూరం శ్రీరాముని దీర్ఘాయువుని సూచిస్తుందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా రాముడిపై అంతులేని ప్రేమతో తన దేహమంతటా ఆ సిందూరాన్ని పూసుకున్నాడు.

News September 9, 2025

కర్ణుడికి అలా ఎందుకు జరిగింది? (1/2)

image

మరణం తర్వాత కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేన్ని తాకినా, అది బంగారంగా మారిపోసాగింది. ఆహారం తిందామన్నా ఇదే పరిస్థితి. దీంతో ‘నేనేం తప్పు చేశా’ అని బాధపడ్డాడు. అప్పుడు అశరీరవాణి ‘కర్ణా! నీవు దానశీలిగా ఎవరికి ఏం కావాలన్నా కాదనకుండా ఇచ్చావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, డబ్బు రూపేణా చేశావు. కానీ, ఒక్కసారైన అన్నదానం చేశావా? ఎవరి ఆకలినైనా తీర్చావా? అందుకే ఈ దుస్థితి’ అని పలికింది.