News April 3, 2024

మథుర కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌

image

UPలోని మథుర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌ పోటీ చేయనున్నారు. ఈ సీటును తొలుత బాక్సర్ విజేందర్ సింగ్‌కు కేటాయించగా, ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటును ముకేశ్‌తో భర్తీ చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి నటి హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మథురతో పాటు సీతాపూర్ అభ్యర్థిని కూడా హస్తం పార్టీ మార్చింది. ఇక్కడ నకుల్ దూబే స్థానంలో రాకేశ్ రాథోడ్ పోటీకి దిగనున్నారు.

Similar News

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/

News November 15, 2025

మూవీ ముచ్చట్లు

image

* Globetrotter ఈవెంట్‌లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె

News November 15, 2025

వట్టి నేలపై కూర్చోకూడదా?

image

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>