News September 8, 2025
రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

రంపచోడవరం, చింతూరు డివిజన్లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.
Similar News
News September 9, 2025
రాష్ట్రమంతా అరకు కాఫీ దుకాణాలే: మంత్రి సంధ్యారాణి

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాప్లు పెట్టాలని, ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంప వ్యాప్తి చేయటంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలన్నారు. ఉత్పత్తుల నిర్వహణ బేరిబోర పురుగు వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలు, అంశాలపై జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ చర్చించారు.
News September 9, 2025
అయిజ: హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం

అయిజ ZPHS హెచ్ఎంను సస్పెండ్ చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ MEO రాములును ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయం కంటే విద్యార్థులు ముందుగా ఇంటికి వెళ్లడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వెళ్లారని హెచ్ఎంను ప్రశ్నించగా మాల పున్నమి కావడంతో ముందుగా వెళ్లారని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ సస్పెండ్ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు.
News September 9, 2025
హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

1.హిమాలయ దేశం నేపాల్లో నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.