News April 3, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ తంగళ్ళపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య. @ ధర్మపురిలో కవల లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు. @ జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి కిందపడి యువకుడి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈవీఎం, వివి ప్యాట్ల ర్యాండమైజేషన్ పూర్తి. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో పట్టపగలే చోరీ. @ ఇబ్రహీంపట్నంలో 2 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్లు పట్టివేత. @ జగిత్యాలలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.
Similar News
News November 6, 2025
కరీంనగర్: TNGO జిల్లా కార్యవర్గ సమావేశం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, పెన్షన్ సమస్య, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఓంటేల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 6, 2025
మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
News November 5, 2025
ఎల్లుండి కరీంనగర్కు గవర్నర్.. కలెక్టర్ మీటింగ్

నవంబర్ 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేసి సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.


