News September 8, 2025
భారత్ పొరుగు దేశాల్లో గొడవలు.. ప్రభుత్వాల మార్పు

2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా
Similar News
News September 9, 2025
RECORD: తొలిసారి రూ.లక్ష దాటిన 22 క్యారెట్ గోల్డ్ రేటు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో చరిత్రలో తొలిసారి 24 క్యారెట్ల బంగారం రూ.1.10లక్షలు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10g పసిడి ధర రూ.1,360 పెరిగి రూ.1,10,290కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1250 ఎగబాకి రూ.1,01,100 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 9, 2025
CDFDలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, పీజీ, డిప్లొమా, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
News September 9, 2025
నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్

ఏపీలో నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.